Medaram Jatara RTC Bus Facilities | మేడారంకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న భక్తులు ఏమంటున్నారంటే! | ABP Desam
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన ములుగు జిల్లాలోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ ల జాతరకు భక్తులు భారీ సంఖ్యలో కోట్లాది సంఖ్యలో తరలివస్తున్నారు. బుధవారం ప్రారంభమైన నాటి నుంచి సమ్మక్క సారక్క జాతరలో పాల్గొనేందుకు వస్తున్న భక్తులతో మేడారం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మేడారం జాతర లో సమ్మక్క సారలమ్మ లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తమ పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా కలిసి వచ్చి సమ్మక్క సారక్క దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవుతున్నారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని డిపోలలో నుండి ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచి భక్తులకు సౌకర్యం కల్పిస్తోంది. ఆర్టీసీ బస్సులలో సమ్మక్క జాతరకు వస్తున్న ప్రయాణికులు దారిలో ఎలా సేద తీరుతున్నారు..? ఆర్టీసీ బస్సుల సేవలు ఏ విధంగా ఉన్నాయి..? సమ్మక్క సారక్క జాతర గురించి భక్తులు ఇంకా ఏమంటున్నారో ఈ వీడియోలో చూద్దాం.