Mahabubabad Student Death | Inter Results 892 Marks: కుమారుడ్ని తల్చుకుని కన్నీరుమున్నీరు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడగుట్టతండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ సీటు రాదన్న ఆందోళనతో నెల క్రితం కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 892 మార్కులు సాధించినట్టు తెలిసింది. ఇది చూసి తమ కుమారుడ్ని తల్చుకుని తల్లిదండ్రులు తల్లడిల్లారు.