Karimnagar Drought: అధికార పార్టీ నేతల ఊళ్లకు నీళ్లిచ్చి.. మిగతా రైతుల పంటలు ఎండగడుతున్నారు

యాసంగి పంటలకు నీరందక.. అక్కడ పొలాలు ఇప్పుడు పశువులను మేపుకునే ప్రదేశాలుగా మారాయి. మొలకెత్తే దశలో నీళ్లందక... వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితొచ్చింది. దాంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్రా అని అరుస్తున్నాడు. కొన్ని చోట్ల తమ పంటలకు ఏకంగా నిప్పు పెట్టుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola