తనకు బిల్లులు చెల్లించట్లేదని ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్

తగిన సమయానికి తనకు బిల్లులు రాలేదంటూ ఓ కాంట్రాక్టర్ ఏకంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాళం వేశారు. మన ఊరు-మన బడి పథకం కింద కరీంనగర్ జిల్లాలోని చింతకుంట ప్రాథమిక పాఠశాలకు శ్రీకాంత్.... నాలుగున్నర లక్షల రూపాయల పనులు చేశారు. స్కూల్ ప్రారంభమై ఇన్ని రోజులైనా బిల్లులు రాకపోవటంతో ఉదయాన్నే స్కూల్ గదులకు తాళం వేశారు. విషయం తెలిసిన డీఈవో జనార్ధన్ రావు కాంట్రాక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola