IAS Officers | హిమాచల్లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఐఏఎస్ కేడర్ సమీక్షలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రాల్లో ఐఏఎస్ పోస్టుల సంఖ్యను తగ్గించగా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (DoPT) చర్యలు చేపట్టింది.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం IAS, IFS క్యాడర్ను తగ్గించాలని కేంద్రాన్ని కోరింది.
IAS పోస్టులను 153 నుంచి 130కి, IFS పోస్టులను 118 నుంచి 83కి తగ్గించాలని ప్రతిపాదించింది. అంటే ఈ రెండు సేవల్లో కలిపి 58 పోస్టుల కోత.
ప్రభుత్వం చెబుతున్న కారణం?
పరిపాలనా ఖర్చు తగ్గించడం, తక్కువ మంది అధికారులతో మరింత సమర్థవంతమైన పాలన అందించడం.
కానీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ IAS క్యాడర్ 239 నుంచి 259కి పెరిగింది.
తెలంగాణ IAS క్యాడర్ 208 నుంచి 218కి పెరిగింది.
అంటే...
🔴 Himachal Pradesh — Lean Bureaucracy
🟢 Andhra Pradesh — Cadre Expansion
🟢 Telangana — Cadre Expansion
అసలు ఒక రాష్ట్రం bureaucracyని ఎందుకు తగ్గిస్తుంది?
పెద్ద సంఖ్యలో IAS అధికారులు ఉంటేనే మంచి పాలన వస్తుందా?
లేక తక్కువ మంది, సమర్థవంతమైన అధికారులు ఉంటే సరిపోతుందా?