Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

Continues below advertisement

అర్ధ రాత్రి తల్లి ఒడిలో ఆదమరచి నిద్రపోతున్న 6 నెలల పసిపాపను  బైక్ పై వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లారు ..మెలుకువ వచ్చిన తల్లి అరుస్తూ వారివెంట పడింది.. దుండగులు బైక్ పై వేగంగా పారిపోయారు.. వెంటనే  తల్లి సూరారం పి.ఎస్ లో పిర్యాదు చేసింది..  కేసు నమోదు చేసుకున్న పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి  ఆరు నెలల బాలిక కిడ్నాప్ కేసును ఛేదించారు..
దాదాపు 50 cc కెమరాల ఆధారంగా కేసునుఛేదించారు.. పోలీసుల దర్యాప్తులో  పసిపాప రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ని  ఓ పంక్షన్ హాలులో పనిచేసే శ్రీదేవి(35) దగ్గర ఉన్నట్లు గా గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకొని పసిపాపను రక్షించి తల్లి ఒడికి చేర్చారు ..
పోలీస్ విచారణలో ఈ కిడ్నాప్ కు సహకరించిన మరో నలుగురు కార్తీక్  (18),జాన్సన్ (24) మరో ఇద్దరు మైనర్లు ఈ కిడ్నాప్ కు ముఠా గా ఏర్పడి పసి పిల్లను దొంగలించినట్లుగా  గుర్తించారు..నిందితురాలు తన ఆడపడుచుకు పిల్లలు లేకపోవడంతో ఆమె కళ్లలో ఆనందం చూడాలనే  తనతో పాటు పంక్షన్ హాలులో  పనిచేస్తున్న పై నిందితులతో కలసి రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసినట్లుగా నిర్ధారించి అందరిని అరెస్టు చేసి రిమాండు తరలిస్తున్నట్లు గా  కుత్బుల్లాపూర్ DCP తెలిపారు..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola