Watch: భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో కి 9,07,616 క్యూసెక్కుల ప్రవాహం చేరుతున్నట్లుగా అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం గోదావరి నీటి మట్టం 30 అడుగులు ఉందని, రాత్రికల్లా ఏకంగా 10 అడుగులు పెరిగిపోయి 40 అడుగులకు చేరిందని వివరించారు. గురువారం ఉదయానికి మరో మూడు అడుగులు పెరిగి 43.50 అడుగుల వద్ద ప్రవహిస్తుండడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు కాలనీల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola