CM Revanth Reddy Challenge To KCR | కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ | ABP Desam
కేసీఆర్ సీఎం పదవి నుంచి దిగిపోయాక రైతు బంధు రావటం లేదన్న ఆరోపణలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇప్పటికే 65 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ఇచ్చినట్లు తెలిపారు. మే 8వ తేదీ లోపు మిగతా నాలుగు లక్షల మందికి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అలా చేయలేని పక్షంలో ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు. ఒకవేళ అలా చేస్తే నువ్వు ముక్కు నేలకు రాస్తావా అని కేసీఆర్ను ప్రశ్నించారు.