Car Accident In Siddipet: బావిలోకి బోల్తా పడ్డ కారు, ఒకరు మృతి
సిద్దిపేట జిల్లాలో ఓ బావిలో కారు పడి ప్రమాదం చోటు చేసుకుంది. కొండపాక మండలం జప్తి నాచారం గ్రామశివార్లలో కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ప్రమాదసమయంలో కారులో ముగ్గురు ఉండగా.... అందులో ఒకరు మరణించారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.... బావిలో ఉన్న కారు బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. బావి నిండా నీరు ఎక్కువగా ఉండటంతో ప్రక్రియ కాస్త కష్టమవుతోంది.