Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

Continues below advertisement

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా కొలంబో చేరుకుంది. ఆగస్టు 15 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా, ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ మంగళవారం సాయంత్రం శ్రీలంకలో ల్యాండ్ అయ్యారు. అయితే, సిరీస్‌కు సెలెక్ట్ అయిన యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ జట్టుతో పాటు ప్రయాణించకపోవడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇండియా 'ఎ' సిరీస్ సమయంలో సాయి సుదర్శన్ కాలికి గాయమైంది. ప్రస్తుతం చిన్న డిస్కమ్‌ఫోర్ట్‌తో బాధపడుతుండటంతో అతడు కొలంబో వెళ్లలేదు. ఆగస్టు 7 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల ప్రాక్టీస్ వార్మప్ మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సుదర్శన్ పూర్తిగా కోలుకోకపోతే, అతడి స్థానంలో అద్భుత ఫామ్‌లో ఉన్న మరొక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. 

మరోవైపు, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఇప్పటికే ఈ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీని బిసిసిఐ స్క్వాడ్‌లోకి తీసుకుంది. నబీ గడిచిన రెండు రంజీ సీజన్లలో ఏకంగా 104 వికెట్లు తీసి రంజీ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. యంగ్ టీమ్‌తో శ్రీలంకలో అడుగుపెట్టిన గిల్ సేన ఈ సిరీస్‌ను ఎలా ప్రారంభిస్తుందో వేచి చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola