Sourav Ganguly slams Pakistan | పాకిస్తాన్ పై సౌరబ్ గంగూలీ కామెంట్స్

Continues below advertisement

టీ20 ప్రపంచకప్ ( T20 World Cup ) వేదికగా భారత్‌తో జరగాల్సిన హై-వోల్టేజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్‌పై పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పలు వివాదాలకు దారితీస్తోంది.

ఈ వ్యవహారంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ) తీవ్రంగా స్పందించారు. పాక్ నిర్ణయాన్ని "అర్థం పర్థం లేనిది"గా కొట్టిపారేశారు. "వరల్డ్ కప్‌ను క్రీడాస్ఫూర్తితో చూడాలి. భయం అనడం సరికాదు. అసలు మ్యాచ్ జరిగేది శ్రీలంకలో అయితే, ఏ పాయింట్ మీద బహిష్కరిస్తున్నారో అర్థం కావడం లేదు" అని గంగూలీ అన్నారు. టోర్నమెంట్‌లో ప్రతి పాయింట్ కీలకమని, ఇలా మ్యాచ్‌ను వదులుకోవడం పాకిస్థాన్‌కే నష్టమని ఆయన హెచ్చరించారు.

లీగ్ దశలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లన్నింటినీ బాయ్‌కాట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌తో ఆడలేమని అంటున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు ( Sri Lanka Cricket Board ) పీసీబీని కోరింది. భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్‌షిప్‌లు, టూరిజం తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో పాకిస్తాన్ షరతులు పెట్టింది. ఆ షరతులకు ఐసీసీ, శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola