ఫ్యాన్‌కు ఫోన్ గిఫ్టిచ్చిన స్మృతి మంథన | ABP Desam

Continues below advertisement

మహిళల ఆసియా కప్ 2024లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన అనంతరం భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంథన మ్యాచ్‌కు వచ్చిన ఒక దివ్యాంగురాలైన ఫ్యాన్‌కు స్మార్ట్ ఫోన్ గిఫ్టిచ్చింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీలంకకు చెందిన ఆదిషా హెరాత్ అనే ఫ్యాన్ తన తల్లితో కలిసి మ్యాచ్ చూడటానికి వచ్చింది. ఆదిషా హెరాత్... స్మృతి మంథనకు పెద్ద ఫ్యాన్ కూడా. ఈ వీడియోను శ్రీలంక క్రికెట్ బోర్డు తమ సోషల్ మీడియా పేజీలో షేర్ చేశారు. స్మృతి మంథన... ఆదిషాను పలకరించగానే తన ముఖం వెలిగిపోయింది. ఫోన్ తీసుకున్నాక ఆదిషా తల్లి తన సంతోషాన్ని పంచుకున్నారు. తన అభిమాన క్రికెటర్ స్మృతి మంథన స్వయంగా వచ్చి మాట్లాడటంతో ఆదిషా హెరాత్ కళ్లలో కూడా ఆనందం తొణికిసలాడింది. వీరితో స్మృతి మంథన ఫొటోలు కూడా దిగారు. ఈ ఫొటోలు, వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram