Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

Continues below advertisement

ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ముగించింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో పరాజయం పాలైన భారత్, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, బెన్ డకెట్ సెంచరీ సాయంతో 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వ్యూహాత్మకంగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదటి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ ఔటయ్యాక, విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ చెలరేగిపోయాడు. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో తొలి వన్డే సెంచరీ నమోదు చేసిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.

అయితే క్రాంప్స్‌తో ఇబ్బందిపడుతూనే పోరాడిన రోహిత్ ఔటైన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు భారత్‌కు శాపంగా మారాయి. కేఎల్ రాహుల్‌కు బదులు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను బ్యాటింగ్‌కు పంపడంతో రన్ రేట్ బాగా తగ్గిపోయింది. అర్ధసెంచరీతో పోరాడుతున్న విరాట్ కోహ్లీ కూడా సామ్ కర్రన్ బౌలింగ్‌లో ఔటవ్వడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 360 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola