Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్

ఐపీఎల్ 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ తెలివైన నిర్ణయాలతో మంచి టీమ్ ను నిర్మించుకుంది. అయితే, మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మాత్రం గుజరాత్ టైటాన్స్ కు వార్నింగ్ ఇస్తున్నారు. టీమ్ బౌలింగ్ విభాగంలోని ఒక బలహీనతగురించి చెప్పుకొచ్చారు. గుజరాత్ జట్టులో కొత్త బాల్ తో వికెట్లు తీసే మహమ్మద్ సిరాజ్, మిడిల్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేసే ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నప్పటికీ.. డెత్ ఒవర్స్ లో పరుగులు నియంత్రించే బౌలర్ కరువయ్యారని కైఫ్ అభిప్రాయపడ్డారు.

గత సీజన్ స్టాట్స్ గురించి మాట్లాడుతూ.. "మహమ్మద్ సిరాజ్ కొత్త బంతితో రాణిస్తాడు, కానీ గత సీజన్ చివరి మూడు మ్యాచ్‌ల్లో చాలా పరుగులు ఫ్రీ గా ఇచ్చాడు. కగిసో రబడా, ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఒత్తిడిలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు" అని కైఫ్ పేర్కొన్నారు. గతేడాది మొదటి 12 మ్యాచ్‌ల్లో 9 గెలిచి టేబుల్ టాప్‌లో ఉన్న గుజరాత్, చివరి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయి టాప్-2 స్థానాన్ని కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ముఖ్యంగా ప్రత్యర్థి జట్లు గుజరాత్‌పై 225 పరుగుల భారీ స్కోర్లు సాధించడమే వారి బౌలింగ్ వైఫల్యానికి నిదర్శనమని కైఫ్ అన్నారు. వేలంలో ప్లానింగ్ బాగున్నా, మైదానంలో ఒత్తిడిని ప్రెషర్ ను కంట్రోల్ చేయలేకపోతున్నారని కైఫ్ అన్నారు. బ్యాటింగ్‌తో పాటు డెత్ బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడితేనే గుజరాత్ టైటాన్స్‌కు ఈ సీజన్‌లో తిరుగుండదని ఆయన స్పష్టం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola