Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?

ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి చివరిది కాబోతుందా? అంటే అవుననే అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. ధోనీ రిటైర్మెంట్‌పై ఇర్ఫాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ .. ధోనీ లేకుండా సీఎస్‌కే అసంపూర్ణమని, పసుపు రంగు జెర్సీలో మహీని చూడటం బహుశా ఇదే చివరిసారి కావచ్చని అభిప్రాయపడ్డాడు. 44 ఏళ్ల వయసులోనూ ధోనీ ఫిట్‌నెస్‌తో అలరిస్తున్నా, భవిష్యత్తు కోసం రుతురాజ్ గైక్వాడ్‌ను ( Ruturaj Gaikwad ) సిద్ధం చేయడంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడని పఠాన్ పేర్కొన్నాడు. ధోనీ కేవలం ప్లేయర్‌గా మాత్రమే కాదు, డ్రెస్సింగ్ రూమ్‌లో అతని ఉనికి జట్టుకు కొండంత బలాన్నిస్తుందని అన్నాడు.

మరోవైపు, సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ కూడా ధోనీ రాకపై క్లారిటీ ఇచ్చారు. ధోనీ ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడతాడని, అయితే వికెట్ కీపర్‌గా బరిలోకి దిగుతాడా లేదా 'ఇంపాక్ట్ ప్లేయర్'గా వస్తాడా అనేది కోచింగ్ స్టాఫ్ నిర్ణయిస్తుందని చెప్పారు. ఇప్పటికే ధోనీ ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆరో ఐపీఎల్ ట్రోఫీని గెలిచి ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola