Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam

Continues below advertisement

 ఐపీఎల్ లో ఓ రూల్ ఉంటుంది. ఏ టీమ్ లో అయినా నలుగురుకు మించి విదేశీ ఆటగాళ్లు ఆడకూడదు. కానీ ఆర్సీబీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడేస్తోందా..? ఇప్పుడు ఇదే ప్రశ్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎదురైంది. మిస్టర్ నాగ్స్ అని ఆర్సీబీ ఇన్ సైడర్ షో ఒకటి నడిపిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. డేనిష్ సేత్ అనే ప్రజెంటర్ మిస్టర్ నాగ్స్ పేరుతో ఫన్నీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు ఆర్సీబీ ప్లేయర్లతో. ఏటా ఐపీఎల్ టైమ్ లో మిస్టర్ నాగ్స్ కి కోహ్లీకి జరిగే ఇంటర్వ్యూ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. రీజన్ కోహ్లీని విపరీతంగా రోస్ట్ చేస్తాడు నాగ్స్. కోహ్లీ కూడా అంతే లైట్ హార్ట్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు ఆ రోస్టింగ్ ని. ఈసారి ఇంటర్వ్యూలో కూడా అంతే. ఆర్సీబీ యాంటీ ఫ్యాన్స్ అంతా ఆర్సీబీ ఐదుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ తో ఎలా ఆడుతుందని క్వశ్చన్ చేస్తున్నారు అని డైరెక్ట్ గా కోహ్లీని క్వశ్చన్ చేశాడు. దానికి కోహ్లీ నవ్వుకుంటూ నన్నెందుకు అడుగుతున్నావ్ ఆ ఆడే ఓవర్సీస్ ప్లేయర్స్ ని అడుగు అంటూ నవ్వేసుకున్నాడు. పైగా నన్నే ఓవర్సీస్ ప్లేయర్ అంటావా అని చిరుకోపం ప్రదర్శించాడు. టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ లండన్ కు మకాం మార్చేశాడు. భార్య అనుష్క శర్మ, తన కొడుకు, కూతురుతో కలిసి లండన్ లో నే ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. టీమిండియా వన్డే మ్యాచులో ఇలా ఐపీఎల్ మ్యాచులు ఉన్నప్పుడు మాత్రమే ఇండియాకు వస్తున్నాడు. సో ఆ ఉద్దేశంతో కోహ్లీని రోస్ట్ చేసేందుకు మిస్టర్ నాగ్స్ ఇలా ఫన్నీ క్వశ్చన్ ని కోహ్లీకి సంధించాడు అన్నమాట.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola