IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్

Continues below advertisement

ఐపీఎల్ 2026 సీజన్‌లో బుధవారం జరిగిన గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద చర్చకు తెరలేపింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సిన సమయంలో కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడంతో ఢిల్లీ ఓటమి పాలైంది.

అయితే, ఈ ఓటమి కంటే కూడా మ్యాచ్ మధ్యలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంపైర్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఢిల్లీకి రావాల్సిన ఒక పరుగు రాకుండా పోవడమే దీనికి కారణం.

ఢిల్లీ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో నితీష్ రాణా ప్యాడ్లకు బంతి తగిలింది. అంపైర్ ఎల్బీడబ్ల్యూ గా భావించి వేలు పైకెత్తారు. అంపైర్ నిర్ణయం రాకముందే బ్యాటర్లు ఒక పరుగు పూర్తి చేశారు. నితీష్ రాణా వెంటనే రివ్యూ తీసుకోగా, థర్డ్ అంపైర్ అది నాటౌట్ అని ప్రకటించారు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు కానీ, బ్యాటర్లు తీసిన ఆ ఒక్క పరుగును మాత్రం స్కోరు బోర్డులో చేర్చలేదు. ఎంసీసీ క్రికెట్ లా ప్రకారం అంపైర్ అవుట్ అని ప్రకటించగానే ఆ బంతి డెడ్ బాల్ గా మారుతుంది. ఢిల్లీ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంతో ఈ రూల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. అంపైర్ చేసిన తప్పుకు ఢిల్లీ జట్టు భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola