శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ టీమిండియా కైవసం | ABP DESAM

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక మొదట బ్యాటింగ్ దిగి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. దీంతో టీమిండియా లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. భారత్ 6.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించింది. మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో దక్కించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా అర్థ సెంచరీ సాధించాడు. ఓపెనర్ పతుమ్ నిశ్శంక 32 పరుగులు, కమిందు మెండిస్ 26 పరుగులు చేశారు. మరెవరూ కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో శ్రీలంక తక్కువ పరుగులకే పరిమితం అయింది. అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో సంజు శామ్సన్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. కానీ అతను డకౌట్ అయ్యాడు. యశస్వి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వేగంగా ఆడటంతో భారత్ 6.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola