Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్

Continues below advertisement

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయినా క్రికెట్‌పై ఆయనకున్న ప్రేమ ఎంత బలమైనదో, బైక్‌లు నడపడంపై కూడా అంతే ఇష్టం. ధోనీకి స్పోర్ట్స్ బైక్‌లంటే చాలా ఇష్టం, అతని వద్ద భారీ బైక్‌ల కలెక్షన్ ఉంది. ఇటీవల చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో రేసింగ్ ట్రాక్‌లో బైక్ నడుపుతూ ధోనీ కనిపించారు. ధోనీ ట్రాక్‌పై ఆరెంజ్ రంగు, స్పాట్స్‌ ఉన్న KTM 390 డ్యూక్‌ నడుపుతూ కనిపించాడు. 

చెన్నైకి, ఎంఎస్ ధోనీకి మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా, అతను ప్రజల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ధోనీ రేసింగ్ సూట్ ధరించి మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లోని ట్రాక్‌పైకి అడుగుపెట్టినప్పుడు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

45 ఏళ్ల వయసులో బైక్‌ల పట్ల అతనికున్న అభిరుచి, అతను మనసులో ఇంకా నిజమైన బైకర్ అనే విషయాన్ని నిరూపిస్తుంది. మహేంద్ర సింగ్ ధోనీ నడిపిన కేటీఎం 390 డ్యూక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర భారత్‌ మార్కెట్లో 2.84 లక్షలు. ఆన్-రోడ్ ధరకి చేరేసరికి, ఈ బైక్ ధర ₹3.30 లక్షలకుపైగా చేరుకుంటుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola