Rohit Sharma T20 World Cup 2024 | అమెరికాలో కేక్ కట్ చేస్తే తినని రోహిత్ శర్మ | ABP Desam

 టీమిండియా టీ20 వరల్డ్ కప్ కోసం సిద్ధమైపోయింది. ఇఫ్పటికే ప్రధాన ఆటగాళ్లంతా అమెరికాకు చేరుకున్నారు. కొహ్లీ, హార్దిక్ పాండ్యా లాంటి కొద్ది మంది ప్లేయర్స్ మాత్రం ఒకటి రెండు రోజుల్లో అమెరికాకు చేరుకుని టీమ్ తో కలవనున్నారు. అయితే ఇప్పటికే అమెరికాకు చేరుకున్న ఆటగాళ్లకు అక్కడ వరల్డ్ కప్ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ లోనే ఓ లాంజ్ లో వెల్కమ్ కేక్ ను అరేంజ్ చేశారు. దిగీ దిగగానే ఆటగాళ్లకు లభించిన స్వాగతంలో ప్లేయర్లంతా కాస్త సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లారు. కేక్ కట్ చేసి అందరూ ఎంజాయ్ చేశారు. ఇదే టైమ్ లో రిషభ్ పంత్ ఓ కేక్ ముక్కను కెప్టెన్ రోహిత్ శర్మకు తినిపించాలని చూశాడు. దానికి రోహిత్ శర్మ నిరాకరిస్తూ పక్కకు వెళ్లిపోయాడు. కొంచెం అసహనంగా జీత్ నే బాద్ ఖాయేంగే అన్నాడు. అంటే ముందు గెలిచిన తర్వాత తిందాం అని. ఆ మాటకు రిషభ్ పంత్ కొంచెం డల్ అయ్యాడు. అది గమనించాడే మళ్లీ వెనక్కి తిరిగిన రోహిత్ శర్మ మీరు ఎంజాయ్ చేయండి నో ప్రాబ్లం అన్నాడు. ఈ వీడియోను ఫ్యాన్స్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఓటమిని రోహిత్ ఇంకా మర్చిపోలేదు. నాకౌట్ స్టేజ్ వరకూ ఓటములే లేకుండా వెళ్లిన టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. బలమైన భారత జట్టు అలాంటి ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించని హిట్ మ్యాన్ పలు సందర్భాల్లో ఆ బాధను వ్యక్తం చేశాడు. అందుకే ఈసారి ఎలా అయినా కెప్టెన్ గా టీమిండియాకు ఓ వరల్డ్ కప్ సాధించి పెట్టాలని చూస్తున్నాడు. అందుకే అమెరికా, వెస్టిండీస్ ల్లో జరగబోయే ఈ టీ20 వరల్డ్ కప్ ను రోహిత్ శర్మ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. ఇలాంటి కేకులు చిన్న చిన్న ఆనందాలు కాదు కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి ప్రస్తుతం రోహిత్ టార్గెట్ అదే. అందుకే లక్ష్యం మీద అంత కసిగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ ఈ వీడియోకు కామెంట్స్ పెడుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola