Rohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABP
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓపెనింగ్ బ్యాటర్ గా ఈ వరల్డ్ కప్ లో అవసరమైన సమయంలో ఫామ్ ను అందుకున్నాడు మన కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. లాస్ట్ సూపర్ 8 మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద కొట్టిన 92పరుగులు, ఇప్పుడు సెమీస్ లో ఇంగ్లండ్ మీద కొట్టిన హాఫ్ సెంచరీ టీమిండియా విజయాల్లో చాలా క్రూషియల్. కెప్టెన్ గానూ రోహిత్ శర్మ ఫుల్ జోష్ లో ఉన్నాడు. తన బౌలర్ల మీద అపారమైన నమ్మకంతో ఉంటూనే వాళ్లను అవసమరైన సమయాల్లో అదిలిస్తూ బెదిరిస్తూ మనల్ని నవ్విస్తున్నాడు కూడా. అలాంటి రోహిత్ శర్మ నిన్న ఏడ్చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్ లో అప్పోనెంట్ టీమ్ ను సపోర్టింగ్ స్టాఫ్ ను విష్ చేసిన రోహిత్..డ్రెస్సింగ్ రూమ్ బయట కుర్చీలో కూర్చుండిపోయాడు. వరుసగా ఏడాది కాలంలో రెండోసారి టీమిండియాను వరల్డ్ కప్ ఫైనల్ కు చేర్చిన ఎమోషనో ఏమో డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చుని కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. రోహిత్ శర్మను చూసిన విరాట్ కొహ్లీ కాసేపు అక్కడ ఆగి అతని భుజంపై తట్టి లోపలకి వెళ్లాడు. మిగిలిన వాళ్లు గమనించలేదు రోహిత్ శర్మ తన షర్ట్ తో కళ్లను తుడుచుకోవటం, వస్తున్న బాధను బిగబట్టి ఆపుకోవటం విజువల్స్ లో కనిపించింది. పైకి సరాదా మనిషిలా గంభీరంగా అరుస్తూ చిరాకు పడుతూ కనపడతాడు కానీ రోహిత్ ఎంత ఎమోషనలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి తర్వాత, 2022 టీ20 వరల్డ్ కప్ లో ఇదే ఇంగ్లండ్ చేతిలో సెమీఫైనల్ ఓడిపోయాక రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మళ్లీ ఇప్పుడు రెండేళ్ల తర్వాత అదే ఇంగ్లండ్ ను గుర్తు పెట్టుకుని మరీ కొట్టినా ఇలా గుక్క పట్టి ఏడ్చేశాడు. అందుకే ఈసారైనా రోహిత్ శర్మ వరల్డ్ కప్పు కొట్టి దేశానికి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ గా నిలవాలని ఆ కన్నీళ్లకు ఓ సార్థకత చేకూర్చాలని టీమిండియా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.