RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam

Continues below advertisement

18ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్ ఏళ్ల పాటు ఎదురు చూసిన ఆ క్షణాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ పూర్తిగా ఎంజాయ్ చేసే లోపే ఓ ఘోరం జరిగిపోయింది. ఆర్సీబీ విక్టరపరేడ్ లో తొక్కిసలాట జరిగిన చిన్నస్వామి స్టేడియం బయట 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదం నింపింది. భారత క్రీడాచరిత్రలోనే అత్యంత విషాదకర ఘట్టాల్లో ఒకటిగా మిగిలిపోయిన ఆ ఘటనను..ఆ మృతులను క్రికెట్ ప్రేమికులుగా శాశ్వతంగా గౌరవించాలని నిర్ణయం తీసుకుంది చిన్నస్వామి స్టేడియం. అందుకే ఏడాదిగా ఎలాంటి మ్యాచ్ లు నిర్వహించకుండా ఆపిన అధికారులు..IPL 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌తో ఈ స్టేడియం మళ్లీ క్రికెట్‌కు స్వాగతం పలకనున్నారు. గతేడాది జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి గౌరవార్థం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ప్రాంగణంలో ఒక స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. స్టేడియం లోపలి ప్రవేశ ద్వారం వద్ద ఈ ఫలకాన్ని ఏర్పాటు చేయటంతో పాటు..మరణించిన 11 మంది జ్ఞాపకార్థం స్టేడియంలోని ఒక ప్రీమియర్ స్టాండ్‌లో 11 సీట్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ సీట్లను ఏ IPL లేదా అంతర్జాతీయ మ్యాచ్‌లకు విక్రయించరు.. అవి ఎప్పటికీ ఖాళీగా ఉండి బాధితుల స్మృతిని గుర్తు చేస్తూనే ఉంటాయని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola