Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam

Continues below advertisement

 ఐపీఎల్ కి పోటీ ఇస్తాం...ప్రపంచం చూడని టీ20 క్రికెట్ ని పరిచయం చేస్తామంటూ బిల్డప్పులు ఇచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ PSL కి ఇప్పుడు పెట్రోల్ బాంబులా పడింది. ఈ మార్చి 28న ఐపీఎల్ తో పాటే ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ గతంలో ఎన్నడూ చూడని ఆంక్షల మధ్య నిర్వహించనున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి తోడు...ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న పాకిస్తాన్ యుద్ధంతో పాక్ క్రికెట్ సంక్షోభంలో పడింది. కానీ మొండిగా పీఎస్ఎల్ ను నిర్వహించాలనే పంతం పట్టింది. స్టార్ ఫారెన్ ప్లేయర్స్ ఇప్పటి వరకూ ఎవ్వరూ పాకిస్తాన్ లో అడుగుపెట్టకపోయినా..ఉన్నవాళ్లతోనే టోర్నీ నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం కొన్ని రూల్స్ పెట్టుకుంది. మొదటిది రెండు కేవలం రెండంటే రెండు వేదికల్లోనే అన్ని పీఎస్ఎల్ మ్యాచులు జరగనున్నాయి. లాహోర్, కరాచీ గ్రౌండుల్లోనే ఎనిమిది జట్లు మ్యాచులు ఆడాలి. ఫలితంగా ఆటగాళ్ల ప్రయాణాల ఖర్చులు, ఇంధనం ఆదా లాంటివి ప్లాన్ చేసింది పాక్ క్రికెట్ బోర్డు. ఇప్పటికే పాక్ లో ఈద్ సెలవును పొడిగించారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఫలితంగా ఇంధనం ఆదా చేస్తున్న పాక్ ప్రభుత్వం...ఈ మ్యాచ్ లకు ఫ్యాన్స్ రావటానికి అనుమతులు ఇవ్వలేదని పీసీబీ ఛైర్మన్ మోషిన్ నఖ్వీ తెలిపారు. అంటే పీఎస్ఎల్ మొత్తం ఫ్యాన్స్ లేకుండా జరగనుంది. అభిమానులు టీవీల్లో చూసుకోవటమే. ఓవైపు ఐపీఎల్ ప్రారంభం కోసం బీసీసీఐ భారీ రేంజ్ లో ఖర్చు పెడుతుంటే మన ఐపీఎల్ ని డామినేట్ చేస్తామన్న పాకిస్తాన్ ఇచ్చిన బిల్డప్పు తుస్సుమనటంతో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ గా మారిందని మన అజయ్ జడేజా లాంటోళ్లు, ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో పాక్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola