Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ క్యాంప్లో కెప్టెన్సీ సెగలు రేగుతున్నాయి. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు ఇవ్వడంపై ఇప్పటికే విమర్శలు వస్తుండగా, తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. హార్దిక్ను తప్పించి సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ ఇవ్వాలని అశ్విన్ డిమాండ్ చేశారు.
"ముంబై ఇండియన్స్ కెప్టెన్ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్కు అప్పగించే సమయం ఎప్పుడో దాటిపోయింది. సూర్య ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్ మాత్రమే కాదు, భారత్కు 2026 టీ20 ప్రపంచకప్ అందించిన విజేత. అంతర్జాతీయ స్థాయిలో దేశాన్ని నడిపిస్తున్న కెప్టెన్, ఐపీఎల్లో మరొకరి కింద ఆడటం అతనికి మానసిక సవాలే" అని అభిప్రాయపడ్డారు.
హార్దిక్ పాండ్యా సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేమని అశ్విన్ పేర్కొన్నారు. గుజరాత్ టైటాన్స్ను తొలి ఏడాదిలోనే ఛాంపియన్గా నిలిపిన ట్రాక్ రికార్డ్ హార్దిక్కు ఉంది. అయితే, ముంబైకి వచ్చాక రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం అతనికి భారంగా మారింది. అభిమానుల నుంచి వచ్చిన వ్యతిరేకత, తీవ్రమైన ఒత్తిడి హార్దిక్ ప్రదర్శనపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తరఫున రెండు ప్రపంచకప్లు అందించిన రోహిత్, సూర్య లాంటి దిగ్గజాలు హార్దిక్ సారథ్యంలో ఆడటం చర్చకు దారితీస్తోంది.