JC Diwakar Reddy: ప్రత్యక్ష రాజకీయాల్లోకి పున:ప్రవేశం చేసిన జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డిది ప్రత్యేక స్థానం. ఐతే... గత సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. అప్పటినుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన వారసులైన పవన్ కు రాజకీయ బాధ్యతలు అప్పగించారు. అప్పుడప్పుడు టీవీల ముందుకు వచ్చి.. వర్తమాన రాజకీయ అంశాలపై పలు కామెంట్స్ చేసేవారు. ఇటీవల రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తుండటంతో.. మళ్లీ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని జేసీ దివాకర్ రెడ్డి భావిస్తున్నారు. పెద్దాయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతుండటంతో.. ఆయన అనుచరుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola