VK Naresh on Ramoji Rao Demise | శ్రీవారి ప్రేమలేఖలుతో రామోజీరావు నాకు లైఫ్ ఇచ్చారు

వాల్ట్ డిస్నీకి ధీటుగా భారతీయ చిత్ర పరిశ్రమను తీసుకువెళ్లిన వ్యక్తి రామోజీరావు అన్నారు నటుడు వీకే నరేష్. తనకు శ్రీవారి ప్రేమలేఖలు సినిమాతో లైఫ్ ఇచ్చారంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

1974లో విశాఖపట్నంలో కేవలం 5వేల కాపీలతో ప్రారంభమైన ఈనాడు టార్గెట్ ఒక్కటే. ఉషోదయానికి ముందే ఈనాడు ఉండాలి. అది పాఠకులకు విపరీతంగా నచ్చేసింది. తెల్లవారు జామునే లేచేసరికి ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోగలగటం పాఠకులను ఈనాడు పత్రికకు దగ్గర చేసింది. ఆంధ్ర అనే శబ్దంతో మొదలైన పత్రికలు ఎక్కువగా ఉండే రోజుల్లో ఈనాడు అని తెలుగు పేరు పెట్టిన రామోజీరావు..ఫాంట్ లోనూ పబ్లికేషన్ ప్లేసుల్లోనూ సరికొత్తకు తెరతీశారు. జిల్లాకు ప్రత్యేకంగా పత్రికలను తీసుకురావటం ఈనాడుకు మరింత మందిని దగ్గరయ్యేలా చేసింది. కార్టూన్లు, మహిళకు ప్రత్యేక పేజీలు, రైతుల కోసం స్పెషల్ కాలమ్స్ అన్నీ కలిసి ఈనాడు పేరును ఓ బ్రాండ్ గా మార్చారు రామోజీ రావు. ఆయన పత్రికలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. తెలుగు వాళ్ల జీవితంలోకి చొచ్చుకు వస్తున్న ఆంగ్ల పదాల స్థానంలో తెలుగు పదాలనే వాడమని రామోజీ రావు ఆయన పాత్రికేయులకు సూచించేవారు. చదవటానికి ఇబ్బందిగా ఉన్నా భాషను బతికించుకోవాలంటే అదొక్కటే దారి అని ఆయన భావించేరావు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola