Vijayawada: AP NGO కార్యాలయ ముట్టడి సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు
Vijayawada లో స్టీరింగ్ కమిటీ నేతల పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమాన్ని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారంటూ మండిపడుతున్నారు ఉపాధ్యాయులు. AP NGO కార్యాలయం వద్ద ఉన్న బండి శ్రీనివాసరావు, శివారెడ్డిల ఫ్లెక్సీలను దుండగులు చించేశారు. NGO కార్యాలయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ముట్టడించే అవకాశం ఉందంటూ పోలీసులు కు సమాచారం రావడంతో, అప్రమత్తంమైన పోలీసులు, NGO భవనం ఉన్న రహదారిని బారికేడ్లతో మూసివేశారు.