TDP vs YCP in Narasaraopet: రోజురోజుకూ ముదురుతున్న ఫ్లెక్సీల వివాదం
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కేసానుపల్లిలో ఫ్లెక్సీల వివాదం కొనసాగుతోంది. టీడీపీ ఫ్లెక్సీకి ఇటీవల వైసీపీ వర్గీయులు నిప్పుపెట్టారు. ఇవాళ మరికొన్ని ఫ్లెక్సీలను చింపేసేందుకు వారు ప్రయత్నిస్తుండగా... తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు వచ్చి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.