Srinivas Goud Firing: గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరపడం చర్చనీయాంశమైంది. ర్యాలీ ప్రారంభించే సమయంలో  పోలీసుల తుపాకీ తీసుకోని గాలిలోకి  కాల్పులు జరిపారు. ఓ మంత్రి.. గన్ తీసుకుని కాల్పులు ఎలా చేస్తారని.. ఇది పోలీసు నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. ఐతే.. మంత్రి శ్రీనివాస్ దీనికి వివరణ ఇస్తూ..  నేను పేల్చింది రబ్బరు బుల్లెట్లు మాత్రమేనన్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా ఇచ్చిన రబ్బరు బుల్లెట్ గన్ పేల్చానని తెలిపారు. తాను ఆలిండియా రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిని. గన్ కు సంబంధించిన నిబంధనలన్నీ నాకు తెలుసన్నారు.    

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola