Srilanka PM Visit Tirumala : సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్న రాజపక్సే దంపతులు
తిరుమల శ్రీవారిని శ్రీలంక ప్రధాని మంత్రి మహింద రాజపక్సే దర్శించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సేే తన సతీమణి శ్రీమతి షిరాంతి రాజపక్సేతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. ముందుగా స్వామి వారి దర్శనార్ధం ఆలయం మహా ద్వారం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధానికి టిటిడి జెఈఓ వీరబ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి మహద్వారం వద్ద ఆలయ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.