సిద్దరామయ్య ఈవెంట్లో భద్రతా లోపం, సీఎం వైపు దూసుకొచ్చిన యువకుడు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బెంగళూరులో ఇంటర్నేషనల్ డెమొక్రసీ డే వేడుకల్లో పాల్గొన్నారు. స్టేజ్పై కూర్చుని ఉండగా అనుకోని సంఘటన జరిగింది. గుర్తు తెలియన వ్యక్తి సెక్యూరిటీని తోసుకుని మరీ వేదికపైకి వచ్చాడు. చేతిలో ఉన్న శాలువాని సిద్దరామయ్యపైకి విసిరాడు. అది కాస్తా పక్కన పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది...ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి లాక్కెళ్లారు. అంత భద్రతను దాటుకుని ఆ వ్యక్తి ఎలా వచ్చాడని సెక్యూరిటీ ఆరా తీస్తోంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.మహదేవ్ నాయక్ అనే యువకుడు ఈ పని చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే అతణ్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ వ్యక్తికి ఎలాంటి నేర చరిత్ర లేదని కేవలం సీఎంని చూసేందుకు మాత్రమే ఇలా వచ్చాడని చెప్పారు. కేవలం ప్రోటోకాల్ ప్రకారం అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. సీఎంకి శాలువా ఇచ్చేందుకు వచ్చినట్టు వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.