తెలంగాణా ఎమ్మెల్యేలు ఆర్టీసి బస్సు ఎక్కాల్సిందే..!
తెలంగాణా ఆర్టీసిని పికల్లోతు నష్టాలను నుండి గట్టెక్కించేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండటంలేదని చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఏబిపి దేశం ప్రతినిధితో మాట్లడుతూ త్వరలో ఆర్టీసి చార్జీలు పెంచబోతున్నామని, ఇప్పటికే సిఎం దృష్టిలో ఉంచామన్నారు. ఆర్టీసి ఆస్తుల నుండి ఆదాయం పెంచేందుకు టెండర్లు పిలిచామన్నారు. తెలంగాణా ఎమ్మెల్యే లు సైతం ఆర్టీసి బస్సు ఎక్కాలని కోరారు.