Ram MNK Chandrasekhar Pemmasani | కేంద్రమంత్రులుగా రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ ప్రమాణం

ఏపీ తెలుగుదేశం ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా, కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్డీయేకు కీలక మిత్రపక్షమైన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అతి పిన్న వయసు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు (36) నిలవనున్నారు. గతంలో ఆయన తండ్రి ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా సేవలు అందించగా, నేడు తొలిసారి కేంద్ర మంత్రిగా యువనేత రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేశారు.

కింజరాపు రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు. ప్రస్తుతం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వయసు 36 సంవత్సరాలు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన ఆయన టీడీపీ నేత బండారు సత్యనారాయణ కుమార్తె శ్రావ్యను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నిహిరఅన్వి, శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తండ్రి మృతితో రామ్మోహన్‌నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola