PRC :పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి,హెచ్ ఆర్ ఏ స్లాబులు మార్చే అవకాశం

అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో పిఆర్సి పై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో పిఆర్సి స్ట్రగుల్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.పిఆర్సి అమల్లో భాగంగా మంత్రుల కమిటీ దృష్టికి తెచ్చిన పలు అంశాలపై చర్చ ప్రారంభం అయింది.ఈ చర్చల్లో మంత్రుల కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, పేర్ని వెంకట్రామయ్యతోపాటు ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే వివిధ ఉద్యోగ సంఘాల తరుపున స్ట్రగుల్ కమిటీ సభ్యులు బండి శ్రీనివాసరావు , కె ఆర్ సూర్యనారాయణ, కె వెంకటరామి రెడ్డి మరియు బొప్పరాజు వెంకటేశ్వర్లు తో పాటు 16 మంది సభ్యులు పాల్గొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola