PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

Continues below advertisement

దేశంలో సంచలనం సృష్టిస్తున్న పేపర్ లీకేజీల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రశ్నాపత్రాల లీకేజీలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుని, త్వరలోనే పార్లమెంట్‌లో కొత్త 'యాంటీ పేపర్ లీక్ బిల్లు' ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి ప్రకటించారు. పేపర్ లీక్ అనేది లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇక విద్యార్థులకు మద్దతుగా 26 రోజులుగా  నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు కలిసి హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు. ఈ వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి సహా పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

 

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) చట్టం, 2024 ప్రకారం పేపర్ లీక్ కేసులలో 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల  వరకు జరిమానా విధించే రూల్ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని మరింత కఠినతరం చేయడానికి సిద్ధమవుతోంది. లేకపోతే కొత్త బిల్లు ప్రవేశపెట్టి కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola