Padma Awards 2022: ఈ ఏడాది 128 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
Continues below advertisement
2022 ఏడాదికి పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. మొత్తం 128 మందికి ఈ అవార్డులు అందజేయనుంది. ఇటీవల ప్లేన్ ప్రమాదంలో కన్నుమూసిన జనరల్ బిపిన్ రావత్ తో పాటు నలుగురికి పద్మవిభూషణ్ ప్రకటించింది. Tata గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, Bharat Biotechకు చెందిన కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల, Microsoft, Google CEOలు Satya Nadella, Sundar Pichai, సీరం ఇన్సిటిట్యూట్ ఎండీ Cyrus Poonawalla సహా 17 మందికి పద్మభూషణ్ ప్రకటించింది. 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఇందులో క్రీడాకారులు Neeraj Chopra, Pramod Bhagat సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ ప్రవచనకర్త Garikapati Narasimha Raoకు సైతం పద్మశ్రీ వచ్చింది.
Continues below advertisement