Breaking News | Munugode Bypoll| మునుగోడు ఉపఎన్నిక TRS అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | ABP Desam
తెలంగాణవ్యాప్తంగా మునుగోడు ఉపఎన్నిక హీట్ నడుస్తోంది. ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా.. టీఆర్ఎస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు.. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య వంటి నేతలు ఆశించినప్పటికీ... కూసుకుంట్ల వైపే కేసీఆర్ మెుగ్గుచూపారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో.. ఇక ప్రచారం జోరు మెుదలుకానుంది.