Mumbai Flyover: ముంబయిలో కుప్పకూలిన ఫ్లైఓవర్.... 14 మందికి గాయాలు

మహారాష్ట్ర ముంబయి బాంద్రాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ కూలింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola