Minister Kodali Nani: పాదయాత్రలో జగన్ మాటిచ్చారు...అందుకే కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు
ABP Desam
Updated at:
28 Jan 2022 12:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడురాజధానుల నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తామని మేనిఫెస్టోలో పెట్టామన్న మంత్రి కొడాలి....పరిపాలనా సౌలభ్యం కోసమే కొన్నిచోట్ల నియోజకవర్గాలను కలిపామన్నారు. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని జగన్ పాదయాత్రలో అనుకున్నారన్న కొడాలి....ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఆయన అభిమానుల తరపున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఎన్టీఆర్ కి వైసీపీ పార్టీ, వైసీపీ నేతలు వ్యతిరేకం కాదన్న కొడాలి నాని....చాలా మందికి వేర్వేరు అభ్యంతరాలున్నా ప్రభుత్వానికి చెప్పొచ్చన్నారు.