Kalingapatnam Beach: కళింగపట్నం తీరప్రాంతంపై స్థానికుల ఆవేదన
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సముద్ర తీర ప్రాంతం రోజురోజుకూ కోతకు గురవుతోంది. జనావాసాలకు అత్యంత సమీపంలోకి సముద్రం రావడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వంశధార నది సైతం అక్కడే కలుస్తుండటంతో సముద్రం పోటు ఎక్కువై ముప్పు వాటిల్లుతోందంటున్నారు. నదికి అవతలివైపు రొయ్యల చెరువుల ఆక్రమణలతో నదీ ప్రవాహ దిశ మార్చుకుంటూ వస్తోంది. దీని వల్ల తీరప్రాంతం కోతకు గురవడమే కాక, అక్కడ నిర్మించిన పార్కూ నాశనమైంది.