JP Nadda: తలుపులు పగులగొట్టి...లాఠీ ఛార్జ్ చేసి...అసలేంటీ హింస...?

Continues below advertisement

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. ఆయన ఏమన్నారంటే..."నిన్న తెలంగాణలో కరీంనగర్ లో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై జరిగిన దాడి దారుణం. ఓ పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేయటానికి జరిగిన హింస ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే. ఎంపీ తన ఆఫీసులో టీచర్లతో సమావేశం అయితే....తలుపులు పగులగొట్టి...రాడ్లతో ధ్వంసం చేసి....ఆ స్థాయిలో అరెస్ట్ చేయటం ఏ మాత్రం న్యాయమో ఆలోచించండి. దీని గురించి ఎంత నిందించినా తప్పు లేదు. కేసీఆర్ ప్రభుత్వం వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా పాలన సాగిస్తోంది. మొన్న జరిగిన ఉపఎన్నికల్లో అక్కడి ప్రభుత్వం దారుణ పరాజయం చవిచూసింది. అయినా ఏ మాత్రం మార్పు లేకుండా సాగించిన ఈ హింసాకాండపై మేం న్యాయపరంగా వెళ్తున్నాం. అక్కడ జరిగిన ఘటనను న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ప్రజా కోర్టులో దీనికి కేసీఆర్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు".

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram