JP Nadda: తలుపులు పగులగొట్టి...లాఠీ ఛార్జ్ చేసి...అసలేంటీ హింస...?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. ఆయన ఏమన్నారంటే..."నిన్న తెలంగాణలో కరీంనగర్ లో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై జరిగిన దాడి దారుణం. ఓ పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేయటానికి జరిగిన హింస ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే. ఎంపీ తన ఆఫీసులో టీచర్లతో సమావేశం అయితే....తలుపులు పగులగొట్టి...రాడ్లతో ధ్వంసం చేసి....ఆ స్థాయిలో అరెస్ట్ చేయటం ఏ మాత్రం న్యాయమో ఆలోచించండి. దీని గురించి ఎంత నిందించినా తప్పు లేదు. కేసీఆర్ ప్రభుత్వం వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా పాలన సాగిస్తోంది. మొన్న జరిగిన ఉపఎన్నికల్లో అక్కడి ప్రభుత్వం దారుణ పరాజయం చవిచూసింది. అయినా ఏ మాత్రం మార్పు లేకుండా సాగించిన ఈ హింసాకాండపై మేం న్యాయపరంగా వెళ్తున్నాం. అక్కడ జరిగిన ఘటనను న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ప్రజా కోర్టులో దీనికి కేసీఆర్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు".