ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

Continues below advertisement

మిడిల్ ఈస్ట్‌లో మరోసారి అలజడి మొదలైంది. ఇజ్రాయేల్‌పై ఇరాన్ ఊహించని స్థాయిలో దాడులు చేసింది. ఏకంగా 400 మిజైల్స్‌తో విరుచుకుపడింది. ఈ అటాక్‌తో ఒక్కసారిగా ఇజ్రాయేల్ ఉలిక్కిపడింది. దేశమంతా సైరన్‌లు మోగించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అలెర్ట్ జారీ చేసింది. ఈ దాడులు చేసిన వెంటనే ఇరాన్‌ ఓ ప్రకటన చేసింది. హమాస్‌ కీలక నేత ఇస్మాయేల్ హనియేని హతమార్చినందుకు.. ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నామని తేల్చి చెప్పింది. ఇజ్రాయేల్ ఉగ్ర చర్యలకు..ఇదే సరైన సమాధానమని స్పష్టం చేసింది. ఈ దాడులపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందించారు. ఇరాన్‌ చాలా పెద్ద తప్పు చేసిందని, అంతకంత అనుభవిస్తుందని వెల్లడించారు. మిడిల్ ఈస్ట్‌లోని అలజడిపై అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. ఇరాన్‌ దాడులను తీవ్రంగా ఖండించింది అమెరికా. ఈ విషయంలో ఇజ్రాయేల్‌కి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని  అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ఇది ఇజ్రాయేల్, అమెరికా సేనల బలానికి పరీక్ష లాంటిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola