Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

Continues below advertisement

 అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరామనవమి వేళ అయోధ్య బాలరాముడి నుదుట ను సూర్య తిలకంతో స్వామి వారు దర్శనమిచ్చారు. సూర్య కిరణం నేరుగా స్వామి వారి నుదుటను తాకే ఆ అద్భుత క్షణాలను వీక్షించి భక్తులు ఆనంద పరవశానికి లోనయ్యారు. ప్రధాని మోదీ అయితే తన కార్యాలయం నుంచే సూర్య తిలక ధారణను వీక్షించారు. స్వామి వారి నుదటను సూర్య కిరణాలు పడగానే మోదీ లేచి నిలబడి టీవీలో నే స్వామివారికి దణ్ణం పెట్టుకున్నారు. అయోధ్య కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఏడాదికోసారి సూర్య తిలకం స్వామివారి నుదుటను తాకేలా బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ సైంటిస్టుల తో సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ ఈ ఏర్పాట్లు చేసింది. కాన్కేవ్, కాన్వెక్స్ లెన్సులతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏడాది కోసారి స్వామి వారి నుదుటను సూర్య తిలకం ప్రసరించేలా అయోధ్య రామాలయంలో ఏర్పాట్లు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola