RG Kar News Update |Kolkata Doctor Case లో మరో ట్విస్ట్.. IMA సంచలన నిర్ణయం | ABP Desam

RG Kar News Update |Kolkata Doctor Case | హాస్పిటల్స్ అంటేనే 24 గంటల సర్వీసు అందుబాటులో ఉంటుంది. కానీ, ఆగస్టు 17న దేశవ్యాప్తంగా ఆసుపత్రులు బంద్ కానున్నాయి. కోల్ కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోవట్లేదని వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ _IMA ప్రకటించింది.  ఇందులో అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుంది. ఐతే.. తొలుత 24 గంటల పాటు ఈ బంద్ కొనసాగనుంది. ఆ తరువాత కూడా ప్రభుత్వాల నుంచి సరైన రెస్పాన్స్ అందకపోతే.. బంద్ ను పెంచే అవకాశం కూడా ఉంది. స్వాతంత్య్ర భారతంలో ఇంత అన్యాయం జరిగితే ప్రధాని మోదీ ఎందుకు స్పందించట్లేదని అక్కడి వైద్యులు ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమం ఆపేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola