8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

రాజస్థాన్‌లో జరిగిన ఓ కారు యాక్సిడెంట్ చూస్తే దాంట్లోని ఎవరైనా కచ్చితంగా చనిపోయి ఉంటారనే అనుకుంటారు. అంత ఘోరంగా ప్రమాదం జరిగిన తీరు ఉంది. కానీ, విచిత్రం ఏంటంటే.. కారు 8 పల్టీలు కొట్టినా అందులోని ఐదుగురు అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు. వారికి చిన్న గాయం కూడా కాలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాజస్థాన్‌లోని నాగౌర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదుగురు వ్యక్తులు కారులో బికనేర్‌ బయల్దేరగా.. మార్గమధ్యంలో ఓ మూలమలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. సెకన్ల వ్యవధిలోనే కనీసం ఎనిమిది సార్లు పల్టీలు కొట్టి ఓ కారు షోరూమ్‌ గేటుపై బోల్తాపడింది. పల్టీలు కొడుతున్న సమయంలో అందులోని ప్రయాణికులు బయటకు దూకేశారు. పైగా కారు షోరూమ్‌ లోపలికి వెళ్లి.. కొంచెం టీ ఇస్తారా అని అడిగినట్లుగా స్థానిక వార్తా సంస్థలు రాశాయి.              

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola