PM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీ

బ్రెజిల్‌లోని Rio de Janeiro లో జరుగుతున్న G20 Summit లో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిశారు. త్వరలోనే పదవి నుంచి దిగిపోతున్న జో బైడెన్‌ను ఈ సందర్భంగా కలుసుకోవడం ఆనందంగా ఉందని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వారు పరస్ఫరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఫోటోలను కూడా మోదీ షేర్ చేశారు. గత జూన్‌లో ఇటలీలో జరిగిన జి7 సమ్మిట్‌లో ప్రధాని మోదీ, జో బిడెన్‌ ఇలాగే కొద్దిసేపు సంభాషించారు. గత ఆగస్టులో, ఇద్దరు నేతలు బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం.. ఆ దేశంలోని మైనారిటీ హిందువులపై జరిగిన దాడులతో సహా పలు అంశాలపై ఫోన్ కాల్‌లో చర్చించారు. జీ 20 సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. యుద్ధాలను ఆపాలని ప్రపంచదేశాలు శాంతి సుముఖంగా పని చేయాలని మోదీ ప్రపంచ దేశాల నేతలకు భారత్ ప్రజల తరపున సూచించారు. శాంతి ని కోరుకున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola