Congress MPs Attack on PM Modi | ప్రధానిని గాయపర్చాలని కాంగ్రెస్ మహిళా ఎంపీల కుట్ర | ABP Desam

Continues below advertisement

 ప్రధాని మోదీని గాయపర్చాలని కాంగ్రెస్ మహిళా ఎంపీలు కుట్ర పన్నినట్లు లోక్ సభ సంచలన ప్రకటన చేసింది. పీటీఐ కథనం ప్రకారం ఫిబ్రవరి 4వ తారీఖు బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రసంగం పై ప్రధాని మోదీ ధన్యవాద తీర్మానంపై లోక్ సభలో మాట్లాడాల్సి ఉండగా ఆయన సభకు రాకుండానే  స్పీకర్ ఓం బిర్లా ధన్యవాద తీర్మానాన్ని మూజువాణి ఓటింగ్ తో పాస్ చేశారు. అయితే దీనిపై పీటీఐ కోరిన వివరణకు లోక్ సభ సంచలన ప్రకటన చేసింది. ప్రధాని మోదీ సభలోకి వచ్చేందుకు సమయం ఆసన్నమవుతున్న టైమ్ లో కాంగ్రెస్ కి సంబంధించిన మహిళా ఎంపీలు ప్రధాని సీటు దగ్గర పెద్ద పెద్ద బ్యానర్లతో నిలబడ్డారని...వారు అటూ ఇటూ తిరుగుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారని..భద్రతా పరంగా అది బ్లాక్ స్పాట్ గా పరిగణించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానిని సభకు రావొద్దని కోరినట్లు పీటీఐకి లోక్ సభ సెక్రటరీ తెలిపారు. ఒకవేళ ప్రధాని వచ్చి ఉంటే ఆయనపై భౌతిక దాడికి దిగాలని కాంగ్రెస్ మహిళా ఎంపీలు కుట్రపన్నినట్లుగా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఈ ఆరోపణలపై కాంగ్రెస్ మండిపడింది. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు అన్న ప్రియాంకా గాంధీ...రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ప్రధాని మోదీ సభకు రాలేదన్నారు. ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించేశారంటూ ప్రియాంకా గాంధీ ఫైర్ అయ్యారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola