Ayodhya Ram Mandir Heavy Rush : భక్తులతో కిక్కిరిసిపోయిన అయోధ్య | ABP Desam
అంగరంగవైభవంగా ప్రాణప్రతిష్ఠాపనా మహోత్సవం పూర్తైన తర్వాత ఈ రోజు నుంచి అయోధ్య బాలరాముడు సామాన్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. సోమవారం వీఐపీల రాకతో సామాన్యులను అయోధ్యలోకి అనుమతించని భద్రతా బలగాలు నిన్న రాత్రి నుంచి సామాన్య భక్తులకూ అవకాశమిచ్చాయి. ప్రాణప్రతిష్ఠ పూర్తైన తర్వాత జరిగే ప్రభాత కాల దర్శనం కావటంతో భక్తులు వేల సంఖ్యలో అయోధ్య రాముడి ఆలయానికి చేరుకున్నారు.