Google CEO Sundar Pichai: సుందర్ పిచాయ్ పై కాపీరైట్ ఉల్లంఘన కేసు..
కాపీరైట్ చట్టం ఉల్లంఘించినందుకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా సంస్థలోని మరో ఐదుగురిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ' ఏక్ హసీనా తి ఏక్ దివానా థా' అనే సినిమాను గుర్తు తెలియని వ్యక్తులు యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేందుకు గూగుల్ అనుమతించిందని ప్రముఖ దర్శకుడు సునీల్ దర్శన్ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.