Gambia Cough Syrup deaths| గాంబియాలో సిరప్ విషాదంపై స్పందించిన కేంద్రం | ABP Desam
భారత్కు చెందిన ఫార్మా సంస్థ తయారు చేసిన సిరప్ల వల్లే మరణాలు సంభవించాయని WHO చెప్పడంతో.. భారత్ లోనూ ఆందోళన మెుదలైంది. దీనిపై స్పందించిన కేంద్రం.. సిరప్ నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపినట్లు తెలిపింది. ఈ సిరప్ లు కేవలం ఇతర దేశాలకు ఎగుమతి చేయాడానికే తయారు చేశారని, భారత్లో వీటి అమ్మకాలు జరగలేదని కేంద్రం వెల్లడించింది.